రంజాన్ చివరి శుక్రవారం నమాజ్ కోసం హైదరాబాద్ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చార్మినార్ ప్రాంతంలో ట్రాఫిక్ డైవర్షన్లు చేశారు. ఈరోజు రంజాన్ చివరి శుక్రవారం కావడంతో మక్కా మసీదులో ప్రత్యేక నమాజ్లు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యేందుకు చర్మినార్ వైపు వెళ్లే ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. హైదరాబాద్ పాత నగరంలో నమాజ్ ప్రశాంతంగా జరిగేలా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
