తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధులు కలిశారు. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికా మేరీల్యాండ్లోని నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తెలుగు మహాసభలకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఆటా సందర్భంగా చేపట్టే కార్యక్రమాలను సీఎం కు వివరించారు ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ NRI లు దత్తత పై కూడా సమావేశంలో చర్చించారు. సీఎం ని కలిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి . మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటా మహా సభలకు ఈ సారి హాజరవుతామని సీఎం ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
