హైదరాబాద్హోమ్

సీఎం రేవంత్ కు ఆటా ప్రతినిధుల ఆహ్వానం

#ATA

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ని ‌ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్ర‌తినిధులు కలిశారు. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికా మేరీల్యాండ్‌లోని నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తెలుగు మహాసభల‌కు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఆటా సందర్భంగా చేపట్టే కార్యక్రమాలను సీఎం కు వివరించారు ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా.

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ NRI లు  దత్తత పై కూడా సమావేశంలో చర్చించారు. సీఎం ని క‌లిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేష‌న్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి . మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటా మహా సభలకు ఈ సారి హాజరవుతామని సీఎం ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

Related posts

ఇప్పుడు… మీ రోజువారీ స్టైల్‌కి కూడా లగ్జరీ టచ్

Satyam News

ఇరాన్ పై దాడి: 165 మంది బాలికలు మృతి?

Satyam News

ఆగష్టు 16న స్థానిక ఆలయాల్లో గోకులాష్టమి

Satyam News

సిరి మీడియా అక్రమాలపై దాసరి కుమారుడి ఫిర్యాదు

Satyam News

రోడ్డెక్కిన జనసేన కార్యకర్తలు

Satyam News

సినీ దర్శకుడు పి సి ఆదిత్య కు దాదా ఫాల్కే గౌరవ పురస్కారం

Satyam News

Leave a Comment