ఆధ్యాత్మికంహోమ్

అంగరంగ వైభవంగా శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం

గద్వాల పట్టణంలోని కోటలో వెలిసిన శ్రీ భూలక్ష్మి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా శనివారం రాత్రి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ ఉత్సవాలకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని పుట్ట వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు.వారం రోజులపాటు ఈ వేడుకలు మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో 18 ఏళ్ల క్రితం గద్వాల కోటలోని ఆలయ పరిసర ప్రాంతాలు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మంత్రాలయ మఠానికి అప్పగించారు.

గద్వాల పెద్ద జాతరగా పిలువబడే చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలకు గద్వాల చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు కర్ణాటక ప్రాంతానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని కొలుస్తారు. పెద్ద జాతర సందర్భంగా గద్వాల ప్రాంతంలో భక్తుల రద్దీ నెలకొంటుంది.

బ్రహ్మోత్సవాలలో ఫిబ్రవరి 1న అర్ధరాత్రి రథోత్సవం నిర్వహిస్తారు. రథోత్సవ కార్యక్రమానికి, అంతకు ముందు జరిగే పూజా కార్యక్రమాలు మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ శ్రీపాదుల ఆశీస్సులతో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పులిహోర కోట హోమం నిర్వహించారు. లింగంబావిలో తెప్పోత్సవం ఉంటుంది.

Related posts

విజయనగరం లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

Satyam News

లోకేష్‌ మార్క్‌ పాలిటిక్స్‌.. జగన్ గజ గజ….

Satyam News

ఇంటర్ విద్యార్థులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు

Satyam News

ఉల్లాస్ అక్షరాంధ్రతో 100% అక్షరాస్యత లక్ష్యం

Satyam News

ఎలక్ట్రీషియన్ ఘాతుకం: భార్యను చంపి…

Satyam News

తీవ్ర రూపం దాల్చిన బోడుప్పల్ వక్ఫ్ భూముల సమస్య

Satyam News

Leave a Comment