26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

సుదూర లక్ష్యాలను చేధించే కుశ సిద్ధం చేసిన భారత్

భారత రక్షణ రంగంలో మరో భారీ మైలురాయి నమోదైంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) స్వదేశీ సాంకేతికతతో రూపొందిస్తున్న సుదూర లక్ష్యాలను ఛేదించే గగనతల రక్షణ వ్యవస్థ ‘ప్రాజెక్ట్ కుశ’ తొలి అభివృద్ధి దశ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అత్యాధునిక రక్షణ కవచంగా భావిస్తున్న ఈ వ్యవస్థ, శత్రువుల నుంచి పొంచివున్న ముప్పులను సమర్థవంతంగా తిప్పికొట్టేలా రూపుదిద్దుకుంది. మూడు పొరల ఇంటర్‌సెప్టర్ క్షిపణి వ్యవస్థతో పనిచేసే ఈ ప్రాజెక్ట్, 150 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. శత్రువుల యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు మరియు బాలిస్టిక్ క్షిపణులను కూడా గాలిలోనే అడ్డుకునేలా దీనిని డిజైన్ చేశారు. రష్యాకు చెందిన ఎస్-400 రక్షణ వ్యవస్థకు దీటుగా భారత్ దీనిని అభివృద్ధి చేస్తోంది. 2030 నాటికి ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో రంగంలోకి దించాలని లక్ష్యంగా పెట్టుకున్న రక్షణ శాఖ, దీని ద్వారా దేశ సరిహద్దుల్లో మరింత పటిష్టమైన భద్రతను నిర్ధారించనుంది. ఈ విజయంతో గగనతల రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి దిశగా మరో బలమైన అడుగు వేసింది.

 

Related posts

దేశానికే ఆద‌ర్శంగా తెలంగాణ‌లో అక్రిడిటేష‌న్ల జారీ

Satyam News

నిరాశ్రయ గృహం లో ఉచిత వైద్య శిబిరం

Satyam News

లాజిస్టిక్స్ హబ్ ఆఫ్ ఇండియాగా ఏపీ

Satyam News

ఘనంగా శ్రీకృష్ణదేవరాయల 555వ జయంతి

Satyam News

నాగర్ దొడ్డి గ్రామ వాసికి డాక్టరేట్

Satyam News

స్పీడ్ బోటు ప్రమాదం: 19 మంది భారతీయులు మృతి?

Satyam News

Leave a Comment