గుంటూరుహోమ్

వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సీఐ చిన మల్లయ్య

పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళపై అత్యాచారం కేసులు నిందితుడైన సీఐ చిన్న మల్లయ్య ఎట్టకేలకు శుక్రవారం రాత్రి వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో ఏప్రిల్ 29 న సిఐ చిన్న మల్లయ్య, తనను బలవంతంగా బలత్కారం చేసాడని ధనలక్ష్మి అనే మహిళ పోలిసులకు ఫిర్యాదు చేసింది.

మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు అయిన విషయం తెలుసుకున్న సిఐ చిన్ మల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్ళాడు. చిన్న మల్లయ్య కోసం గత నెల రోజులుగా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మల్లయ్య ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించగా గత నెల 14న బెయిల్ ఫిటిషన్ లను కోర్టు కొట్టి వేసింది.

36 రోజులుగా విధి నిర్వహణకు హజరు కాకపోవడంతో చిన్న మల్లయ్యను రెండు రోజుల క్రితం విధుల నుంచి తోలగిస్తు గుంటూరు రేంజ్ ఐజి కార్యాలయం నుంచి ఉత్తర్వులను జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో చిన్నమయ్య లొంగిపోవడంతో తదుపరి దర్యాప్తు నిర్వహించి కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.

Related posts

సినీ నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న దళపతి విజయ్

Satyam News

దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు

Satyam News

అందరికీ ఆరాధ్యులు పొట్టి శ్రీరాములు

Satyam News

భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం

Satyam News

విశాఖలో మరో పోర్టు.. కొత్త స్టీల్‌ప్లాంట్‌ లోడింగ్‌..!!

Satyam News

రెయిన్ బజార్ రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ నమోదు

Satyam News

Leave a Comment