హైదరాబాద్హోమ్

నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

#Revanthreddy

హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మంగళవారం హాజరయ్యారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ, తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో తనపై నమోదైన కేసుల విషయంలో ఆయన నాంపల్లిలోని మనోరంజన్ కోర్టులో వ్యక్తిగతంగా హాజరై విచారణను ఎదుర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహించారన్న ఆరోపణలపై 2016లో రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అలాగే వివిధ కారణాలతో తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్లలో కూడా అప్పట్లో కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన ఈ కేసులను కొట్టివేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తనపై అక్రమంగా కేసులు పెట్టారని పేర్కొంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ కొనసాగుతుండగా, ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ మూడు కేసులకు సంబంధించిన విచారణ పూర్తయినట్లు సమాచారం.

Related posts

లైసెన్స్డ్ సర్వేయర్లను నట్టేట ముంచిన రేవంత్ సర్కార్

Satyam News

విశాఖకి అమెజాన్‌..  ఐటీ ప్లస్‌ AWS డేటా సెంటర్‌..!

Satyam News

క్షీణించిన ఆశా భోంస్లే ఆరోగ్యం: బ్రిచ్కాండి ఆసుపత్రిలో చికిత్స

Satyam News

వృద్ధి రేటు పెరుగుదలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Satyam News

Pirates: రెండు భారతీయ నౌకల హైజాక్

Satyam News

షాడో గుప్పిట్లో మెడికల్ కాలేజీ విలవిల

Satyam News

Leave a Comment