విశాఖపట్నంహోమ్

పూర్ణా మార్కెట్ అగ్నిప్రమాద బాధితులకు పరిహారం

#SitamrajuSudhakar

విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలోని 35వ వార్డులో ఉన్న పూర్ణ మార్కెట్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 16 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనపై వార్డు నాయకులు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్‌చార్జ్  సీతంరాజు సుధాకర్ కి సమాచారం అందించగానే, ఆయన వెంటనే ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

సీతంరాజు సుధాకర్ చొరవతో తమ జీవనోపాధిని కోల్పోయిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. కూటమి ప్రభుత్వం బాధితుల కోసం ధ్వంసం అయిన దుకాణాలను కొత్తగా నిర్మించడంతో పాటు, ప్రతి లబ్ధిదారునికి ఆర్థిక సహాయంగా రూ.10,000 చెక్కులను మంజూరు చేసింది.

ఈ చెక్కులను తెలుగు దేశం పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్‌చార్జ్ సీతంరాజు సుధాకర్, జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి, కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

అది దేవాదాయ శాఖకు పూజారులకు మధ్య వివాదం

Satyam News

అప్పుల బాధ తాళలేక వ్యాపారి ఆత్మహత్య

Satyam News

రోజా ఇంట్లో హెరిటేజ్ పాలు..వీడియో వైరల్‌!

Satyam News

లక్షలాది రూపాయల దుర్వినియోగంపై సీఎంకు ఫిర్యాదు

Satyam News

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై శుభవార్త

Satyam News

లక్షలాది మంది భక్తులతో ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

Satyam News

Leave a Comment