ప్రత్యేకంహోమ్

కువైట్ విమానాశ్రయం పై డ్రోన్ దాడి

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం భారీ డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. విమానాశ్రయ ఆవరణలోని ఇంధన ట్యాంకును లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరగడంతో అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని కువైట్ పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ అధికారికంగా ధృవీకరించింది.

సంఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక బృందాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పౌర విమానయాన సంస్థ అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్-రాజీ మాట్లాడుతూ.. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ దాడిలో కేవలం ఆస్తి నష్టం మాత్రమే సంభవించిందని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు.

విమానాశ్రయ భద్రతా యంత్రాంగం మరియు సంబంధిత అధికారులు వెంటనే అప్రమత్తమై అత్యవసర ప్రోటోకాల్స్‌ను అమలు చేశారని ఆయన వెల్లడించారు. ఈ దాడి వెనుక ఉన్న కారణాలపై అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు.

Related posts

శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని తీసుకుంటున్న ఆంధ్ర

Satyam News

అనంతబాబు కోసం దళితులకు జగన్‌ అన్యాయం.!

Satyam News

మమత ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక

Satyam News

ప్రపంచ కప్ మూడో సారి భారత్ కైవసం

Satyam News

అనుమానంతో భార్య కాలు నరికిన భర్త

Satyam News

చంద్రబాబు ప్రతిపాదనపై అమిత్ షా స్పందన ఏమిటి?

Satyam News

Leave a Comment