ప్రపంచంహోమ్

ఒక వ్యక్తి స్వార్థం కోసమే ఈ యుద్ధం

టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నెతన్యాహు తన రాజకీయ మనుగడ కోసం సాగిస్తున్న ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న 800 కోట్ల మంది ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేవలం ఒక వ్యక్తి స్వార్థం కోసం ప్రపంచ దేశాలను, వాటి ఆర్థిక వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధి మూతపడటం వల్ల అంతర్జాతీయ ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీస్తోందని ఎర్డోగాన్ హెచ్చరించారు.

ఇజ్రాయెల్ సాగిస్తున్న ఈ దాడులు కేవలం భద్రతా కారణాలతో చేస్తున్నవి కావని, ఈ ప్రాంతాన్ని విపత్తులోకి నెట్టేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గాజా నుంచి మొదలై యెమెన్, లెబనాన్ మరియు ఇరాన్ వరకు విస్తరించిన ఈ యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ మార్కెట్లను అస్తవ్యస్తం చేశాయని ఆయన విమర్శించారు.

ఇజ్రాయెల్ అనుసరిస్తున్న మొండి వైఖరి దౌత్యపరమైన పరిష్కారాలకు అడ్డుగా మారుతోందని, తక్షణమే ఈ అక్రమ యుద్ధానికి స్వస్తి పలకాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలు ధైర్యంగా ముందుకు వచ్చి నెతన్యాహు నేతృత్వంలోని ఈ హింసాకాండను అడ్డుకోకపోతే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి దశాబ్దాల కాలం పడుతుందని ఎర్డోగాన్ స్పష్టం చేశారు.

Related posts

అలనాటి నటిని పట్టించుకోని సినీ రంగం

Satyam News

శ్రీరామ జన్మభూమి ఆలయం శిఖరంపై కాషాయ ధర్మ ధ్వజం

Satyam News

సిగరెట్లు, పాన్ మసాలా ప్రియం

Satyam News

సూర్యలంక తీరం లో మరో రెండు రోజుల పాటు నిషేధం

Satyam News

అంబులెన్స్ లో మంటలు: నవజాత శిశువు సజీవ దహనం

Satyam News

జె మో రె కు విషయ పరిజ్ఞానం లేదు

Satyam News

Leave a Comment