పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యకు వైవాహికేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్య కాలును నరికాడు. వల్లెపు లక్ష్మయ్య తన భార్య భూలక్ష్మితో గొడవపడి, కట్టెలు నరికే గొడ్డలితో కుడికాలు మనికట్టు వద్ద నరికాడు.
తీవ్రంగా గాయపడిన భూలక్ష్మిని స్థానికులు తొలుత సత్తెనపల్లి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అనంతరం అంబులెన్సులో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
