శ్రీకాకుళంహోమ్

జీసీసీ పెట్రోల్ బంక్ నిర్మాణ పనుల పరిశీలన

#KidariShravanKumar

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని కొత్తూరు మండలం పరిధిలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న కొత్త పెట్రోల్ బంక్ పనులను జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ స్వయంగా పరిశీలించారు. గిరిజన ప్రాంతాల్లో ఇంధన సౌకర్యాల కొరతను దృష్టిలో ఉంచుకుని జీసీసీ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ త్వరగా పూర్తి అయి స్థానికులకు ఉపయోగపడాలని ఆయన సూచించారు.

పెట్రోల్ బంక్ నిర్మాణ ప్రగతి, పనుల నాణ్యత, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతున్నాయా అనే విషయాలను శ్రావణ్ కుమార్ విపులంగా పరిశీలించారు. అలాగే భవిష్యత్‌లో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సర్వీస్ లైన్ల ఏర్పాటు, రోడ్డు యాక్సెస్, పార్కింగ్ స్థలాలు వంటి అంశాలను అధికారులతో సమీక్షించారు.

కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో ఇంధన సౌలభ్యం పెంచడం జీసీసీ ప్రధాన లక్ష్యమని, కొత్తూరు మండలంలో ఏర్పడుతున్న పెట్రోల్ బంక్ స్థానిక గిరిజనులకు మిక్కిలి ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌ను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ సంస్థను ఆదేశించారు. ఈ సందర్శన కార్యక్రమంలో జీసీసీ డివిజనల్ మేనేజర్ సంధ్యారాణి, సీతంపేట మేనేజర్ కృష్ణ, పాతపట్నం మేనేజర్ నరసింహులు, పాలకొండ ఇంచార్జ్ భూదేవి తదితర అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఉత్తరప్రదేశ్ లో వర్ష భీభత్సం: 50 మంది మృతి

Satyam News

17 నుండి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు

Satyam News

సూపర్ జీఎస్టీ “ఎలక్ట్రానిక్స్ ఉత్సవ్” ప్రదర్శన

Satyam News

హోర్మోజ్ లో బాంబులు ఎక్కడ పెట్టారో మరచిపోయిన ఇరాన్

Satyam News

పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు పెంపు

Satyam News

వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్

Satyam News

Leave a Comment