25.2 C
Hyderabad
September 20, 2026
తెలంగాణహోమ్

ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్ స్కూల్‌కు జీహెచ్‌ఎంసీ నోటీసు

#GHMC

సెరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్‌ (జీహెచ్‌ఎంసీ) ఖాజాగూడలోని ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్ స్కూల్‌ యాజమాన్యానికి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. పాఠశాల వాహనాలను ప్రజా రహదారులపై పార్క్‌ చేయడం ద్వారా ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించడం, ట్రాఫిక్‌ రద్దీ సృష్టించడం వంటి కారణాలతో ఈ చర్య తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారుల ప్రకారం, ఖాజాగూడ–సెరిలింగంపల్లి ప్రాంతంలో సుమారు 500 మీటర్ల రహదారి పొడవున పాఠశాల వాహనాలు పార్క్‌ చేయబడి, ట్రాఫిక్‌ నిరోధం కలుగుతోంది.

ఇది జీహెచ్‌ఎంసీ చట్టం–1955, తెలంగాణ జీ–బాస్‌ చట్టం–2020 నిబంధనలకు విరుద్ధం. జీహెచ్‌ఎంసీ చట్టం–1955లోని సెక్షన్‌ 405 ప్రకారం, ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ ప్రజా ఆస్తి లేదా ప్రభుత్వ భూమిని ఆక్రమించడం, అడ్డుకోవడం నిషేధం. ప్రజా రహదారులపై అక్రమ పార్కింగ్‌ పూర్తిగా నిషేధించబడింది. దీనికి జరిమానాలు, వాహనాల తొలగింపు (టోవింగ్‌), అలాగే చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా ఉంటాయి.

పాఠశాల వాహనాలను వెంటనే రహదారి నుంచి తొలగించాలి, ఇకపై ప్రజా రహదారులపై పార్కింగ్‌ చేయరాదని జీహెచ్‌ఎంసీ ఆదేశించింది. అలాగే, నోటీసు అందుకున్న మూడు రోజుల్లోపు పాఠశాల యాజమాన్యం లిఖితపూర్వక వివరణ సమర్పించాలని సూచించింది. ఆదేశాలను పాటించకపోతే, వాహనాలను పాఠశాల ఖర్చు, బాధ్యతపై తొలగించి స్వాధీనం చేసుకోవడంతో పాటు, జరిమానాలు విధించి, జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు చేపడతామని అధికారులు హెచ్చరించారు.

Related posts

జూలై నెలలో శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Satyam News

క్షణానికో మాట మారుస్తున్న డోనాల్డ్ ట్రంప్

Satyam News

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి!

Satyam News

Satyam News

లక్ష్యం సాధించే వరకు దాడులు ఆగవు

Satyam News

సంచలన విషయాలు బయటపెట్టనున్న లేడీ డాన్ అరుణ?

Satyam News

Leave a Comment