జాతీయ మానవ హక్కుల సంఘం కుత్బుల్లాపూర్ మండల్ ఉపాధ్యక్షుడిగా గాజులరామారం బాలయ్యనగర్కు చెందిన చించొలే సాయికుమార్ నియమితులయ్యారు.
తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దార్థ ఆయనకు కూకట్ పల్లి లో నియామకపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ మండలం లో మానవహక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని, సోదరభావం, సామాజిక సమత కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం సభ్యులు ఆయనను అభినందించారు.కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు డా. బొర్రాన్ బాబు రావు, సాయికిరణ్, ఫెరోజ్ అలీ, మొహ్మద్ ఖురేషి, విజయ్, నందన్, మహేష్, భీంరావు, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.
