కడపహోమ్

పెట్రేగి పోతున్న అక్రమ మట్టి మాఫియా

#crime

అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలంలో మట్టి మాఫియా ఆగడాలు శృతిమించుతున్నాయి. మట్టి మాఫియా గుట్టలను మింగేస్తున్నది. రెవెన్యూ మైనింగ్ అధికారులను మేము మేనేజ్ చేసుకున్నాం అన్న ధీమాతో పట్టబగలు మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని కంచిపాటి వాండ్ల పల్లెలో అక్రమ మట్టి రవాణా కట్టలు తెంచుకుంది.

మండల కేంద్రానికి కూతబెట్టి దూరంలో ఇంత జరుగుతుంటే రెవెన్యూ అధికారులు మొద్దు నిద్ర ప్రదర్శిస్తూ ఉండడం అవినీతికి లంచాల పర్వానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఉదయం నుంచి మట్టి అక్రమ రవాణా జరుగుతుంటే మండలంలోని ప్రజలందరికీ తెలిసినా రెవెన్యూ అధికారులకు తెలియకపోవడం శోచనీయం. మైనింగ్ అధికారులు కూడా నిద్రమత్తును ప్రదర్శిస్తూ అక్రమ మట్టి వానాదారులతో కుమ్మక్కైనట్లు స్పష్టంగా కనిపిస్తోందని పలువురు బహిరంగంగానే విమర్శిస్తూ ఉన్నారు.

Related posts

డీలిమిటేషన్ అర్ధం లేని చర్య

Satyam News

ఈవీ బస్సు ‘పల్లె వెలుగు’ అయినా ఏసీనే

Satyam News

లడఖ్ లో మళ్లీ హింస: నలుగురు మృతి

Satyam News

ఆన్‌లైన్‌లో మహానాడు: చంద్రబాబు సంచలన నిర్ణయం

Satyam News

జర్నలిస్టు హత్య కేసు నిందితుడి అరెస్టు

Satyam News

#GoodNews: హోర్మోజ్ జల సంధి దాటిన భారత్ ఎల్పీజీ నౌక

Satyam News

Leave a Comment