ముఖ్యంశాలుహోమ్

తెలంగాణలో ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్

#RevanthReddy

తెలంగాణలో ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్, ఆయిల్ పామ్ సాగు విస్తరణ తదితర అంశాలపై గోద్రేజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తో చర్చించారు. రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ సాగు విస్తరణపై ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు నివేదికను అందించారు.

ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి తో గోద్రేజ్ గ్రూపు సంస్థల కార్పొరేట్ అఫేర్స్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి, ఆగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగత నియోగి భేటీ అయ్యారు.

ఖ‌మ్మం జిల్లాలో ₹ 300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు ద్వారా 700 మందికి పైగా ఉపాధి కల్పించనున్నట్టు ప్రతినిధులు వివరించారు. ఇందులో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, న‌ర్సరీ, పరిశోధన – అభివృద్ధి కేంద్రం, సీడ్ గార్డెన్ ఏర్పాటు కోసం ఖమ్మం జిల్లా కొనిజ‌ర్ల మండ‌లం గుబ్బగుర్తి గ్రామంలో 113.5 ఎక‌రాల భూమిని ప్ర‌భుత్వం కేటాయించింది.

సీడ్ గార్డెన్ విస్తరణ కోసం అదనంగా మరో 35 నుంచి 40 ఎక‌రాల భూమిని కేటాయించాల‌ని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, ప్రాసెసింగ్ యూనిట్ కోసం రాహ‌దారిని విస్త‌రించాల‌ని ముఖ్య‌మంత్రి ని కోరారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి టీజీఐఐసీ ఆధ్వ‌ర్యంలో రోడ్డు విస్త‌ర‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

Related posts

ఉరిశిక్ష అమలు విధానాలను మార్చడం కుదరదు

Satyam News

న్యూజెర్సీలో మీట్ అండ్ గ్రీట్ విత్ హరీష్ రావు

Satyam News

మైనర్ బాలిక తల్లి బహిరంగ ప్రకటన ఇది….

Satyam News

నెయ్యి ట్యాంకర్ బోల్తా: ప్రమాదమా? కుట్రా?

Satyam News

ప్రతి ఇంటా సుఖశాంతులు నిండాలి

Satyam News

రిజర్వేషన్ విధానాన్ని సమర్ధంగా అమలు చేయాలి

Satyam News

Leave a Comment