26.3 C
Hyderabad
September 19, 2026
ప్రపంచంహోమ్

ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు కొనసాగిస్తాం

#IRGC

ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (IRGC) తాజాగా “ఆపరేషన్ ట్రూ ప్రామిస్–4”లో భాగంగా 72వ దాడి తరంగాన్ని (Wave 72) నిర్వహించినట్లు ప్రకటించింది. ఈ దాడికి “యా రసూల్ అల్లాహ్” అనే కోడ్ నేమ్ పెట్టినట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ మధ్య మరియు ఉత్తర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు IRGC తెలిపింది.

అలాగే బహ్రెయిన్‌లో ఉన్న US Fifth Fleet స్థావరాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని ఖద్ర్ (Qadr), ఎమ్మాద్ (Emad) వంటి ఖచ్చితమైన క్షిపణి వ్యవస్థలను ఉపయోగించినట్లు పేర్కొంది. IRGC ప్రకటన ప్రకారం, ఈ ఆపరేషన్‌లో భాగంగా అమెరికా సైనిక స్థావరాలపై కూడా భారీ సమిష్టి దాడులు చేపట్టినట్లు తెలిపింది.

ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని Al Minhad Air Base, కువైట్‌లోని Ali Al Salem Air Base స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ స్థావరాల్లో ఉన్న యుద్ధవిమానాల షెల్టర్లు, ఇంధన నిల్వ కేంద్రాలపై భారీ బాలిస్టిక్ క్షిపణులు, దాడి డ్రోన్లతో దాడులు జరిపినట్లు తెలిపింది. ఈ సైనిక స్థావరాలు ఇటీవల ఇరాన్‌పై జరిగిన దాడులకు ప్రయోగ స్థావరాలుగా ఉపయోగించబడ్డాయని IRGC ఆరోపించింది.

అందుకే ప్రతీకారంగా ఈ దాడులు నిర్వహించినట్లు పేర్కొంది. ఇక ముందు దశలో మరింత ఆధునిక దాడి, రక్షణ వ్యవస్థలను వినియోగించనున్నట్లు హెచ్చరించింది. యుద్ధభూమి అంతటా నిరంతర ఒత్తిడి కొనసాగుతుందని, సైరన్‌లు నిరంతరం మోగుతూనే ఉంటాయని IRGC స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts

అవుట్‌డోర్ ప్రకటన విధానం పై రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో

Satyam News

17 నుంచి బాగేశ్వర్ సర్కార్ శ్రీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి దివ్య దర్బార్

Satyam News

దుబాయ్ లో చిక్కుకుపోయిన వారు సురక్షితంగా….

Satyam News

సంగీత సరస్వతి ఎస్. జానకి కన్నుమూత

Satyam News

#GoodNews: హోర్మోజ్ జల సంధి దాటిన భారత్ ఎల్పీజీ నౌక

Satyam News

ఉయ్యూరులో వైభవంగా శ్రీనివాస కళ్యాణం

Satyam News

Leave a Comment