వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప తాలూకా పరిధిలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. బిల్టప్ సర్కిల్ నుండి లోహియా నగర్ వరకు తాలూకా ఎస్.ఐ మోహన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.
రోడ్డును ఆక్రమించిన దుకాణదారులు, తోపుడు బండ్ల వారికి పలు సూచనలు చేసి ప్రజలకు ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా సాఫీగా సాగేందుకు చర్యలు చేపట్టారు. రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని షాపుల నిర్వాహకులను హెచ్చరించారు. నిర్ణీత ప్రదేశాలలో వాహనాలను పార్కింగ్ చేసుకునేలా వినియోగదారులకు తెలియచేయాలని షాపుల నిర్వాహకులకు ఎస్.ఐ సూచించారు.

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్న మోడీ