ప్రత్యేకంహోమ్

నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్

#NaraLokesh

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అమరావతిలో జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన హస్తినకు బయలుదేరుతారు.

షెడ్యూల్ ప్రకారం, నేడు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ నుండి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు.

రేపు ఉదయం పార్లమెంట్ భవనానికి వెళ్లనున్న ఆయన, అక్కడ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలు, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన ప్రాజెక్టుల పురోగతిపై వారితో చర్చించే అవకాశం ఉంది.

తన పర్యటన ముగించుకుని రేపు అర్ధరాత్రికి లోకేష్ తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

Related posts

రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే నా ఆశ

Satyam News

ఓటర్ల జాబితా సవరణలో తప్పులు జరిగితే ఊరుకోం

Satyam News

డ్రగ్స్ రహిత రాష్ట్రం గా ఆంధ్ర ప్రదేశ్

Satyam News

లైంగిక వ్యాధులతో బిల్ గేట్స్… నిజామా?

Satyam News

గద్వాల చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

Satyam News

రైతు బాధలు వింటే కడుపు తరుక్కపోతోంది

Satyam News

Leave a Comment