హైదరాబాద్హోమ్

మెడికో ప్రియాంక భౌతికకాయానికి మంత్రి నివాళి

#VakitiSrihari

రాజమండ్రిలో జరిగిన ఒక దారుణ సంఘటనలో గాయపడి హైదరాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన మెడికో ప్రియాంక భౌతిక కాయానికి మంత్రి వాకిటి శ్రీహరి నివాళి అర్పించారు. గాంధీ ఆస్పత్రి మార్చురీలో మెడికో విద్యార్థిని ప్రియాంక భౌతికకాయాన్ని ఆయన సందర్శించారు. ఆయనతో బాటు మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ కూడా నివాళులు అర్పించారు. అనంతరం ప్రియాంక తండ్రిని పరామర్శించిన మంత్రి శ్రీహరి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ప్రియాంక ఘటన అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. నిందితులు చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని తప్పించుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ప్రియాంక ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి తమకు, అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు.

Related posts

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకే పెను ప్రమాదం

Satyam News

ఆసుపత్రిలో చేరిన సల్మాన్ ఖాన్ తండ్రి

Satyam News

తిరుగుబాటు చేసి బలి అయిన కవిత

Satyam News

మతం కన్నా మిత్రత్వమే ఎక్కువ….

Satyam News

కుటుంబ వివాదాలతో జగన్‌ పొలిటికల్ ఇమేజ్ డ్యామేజ్….!!

Satyam News

అనుకూల తీర్పు రావాలంటే లంచం?

Satyam News

Leave a Comment