25.2 C
Hyderabad
September 20, 2026
ప్రపంచంహోమ్

లైవ్ లో క్షిపణి దాడి… ఓ మై గాడ్..

లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా ఒక విలేకరి మృత్యుఒడిలోకి వెళ్లి త్రుటిలో తప్పించుకున్న దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. రష్యాకు చెందిన RT (రష్యా టుడే) వార్తా సంస్థ జర్నలిస్ట్ స్టీవ్ స్వీనీ క్షేత్రస్థాయి నుంచి ప్రత్యక్ష ప్రసారం నిర్వహిస్తుండగా, ఆయనకు అతి సమీపంలో ఒక క్షిపణి వచ్చి పడింది.

వార్తా సేకరణలో భాగంగా స్టీవ్ స్వీనీ కెమెరా ముందు మాట్లాడుతుండగా, ఒక్కసారిగా భారీ శబ్దంతో క్షిపణి దూసుకొచ్చింది. ఆ క్షిపణి ఆయనకు చాలా దగ్గరగా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. పేలుడు ధాటికి అక్కడి ప్రాంతమంతా క్షణాల్లో పొగతో నిండిపోయింది. ఆ సమయంలో స్వీనీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైనప్పటికీ, అదృష్టవశాత్తూ ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం కలగలేదు. తృటిలో ప్రాణాలతో బయటపడిన ఆయన, ఆ ప్రమాదం నుంచి కోలుకుని సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు.

ఈ భయంకరమైన దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. యుద్ధ ప్రాతిపదికన రిపోర్టింగ్ చేస్తున్న జర్నలిస్టులు ఎంతటి ప్రాణాల తెగింపుతో పనిచేస్తున్నారో ఈ ఘటన మరోసారి అద్దం పడుతోంది. నెటిజన్లు ఈ వీడియో చూసి విస్తుపోవడమే కాకుండా, సదరు జర్నలిస్ట్ క్షేమంగా ఉన్నందుకు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Related posts

హార్ముజ్‌ జలసంధి దగ్గర చిక్కుకుపోయిన ఆయిల్ నౌకలు

Satyam News

సంచలన విషయాలు బయటపెట్టనున్న లేడీ డాన్ అరుణ?

Satyam News

కొత్తగా 4 లక్షల ఇళ్లు…. ఏపీలో పేదలకు మరో వరం

Satyam News

ఐస్ క్రీమ్ లో వీర్యం కలిపిన ఘనుడు

Satyam News

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..??

Satyam News

విశాఖకు ఏఐ పవర్.. గ్లోబల్‌ ఐటీ మ్యాప్‌లో ఏపీ

Satyam News

Leave a Comment