అమాయకులను మోసం చేయడం, పత్రాలను ఫోర్జరీ చేయడం, భూములను అక్రమంగా కబ్జా చేయడం, జీఎస్టీ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి చిన్న స్థాయి నుంచి పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తూ పలువురిని మోసం చేశారనే ఆరోపణలపై ఓ కిలాడి దంపతులపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఇప్పటికే వీరిపై పలు ఆరోపణలు, ఫిర్యాదులు నమోదైన నేపథ్యంలో, కోర్టు ఆదేశాల మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
