గుంటూరుహోమ్

మంగళగిరిలో రౌడీ షీటర్ అరెస్టు

#Mangalagiri

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ హెచ్చరించారు. నేరాలకు పాల్పడే వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే అరెస్టులు చేయడంతో పాటు రౌడీ షీట్లు కూడా నమోదు చేసి చట్టపరమైన చర్యలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

పెదవడ్లపూడి గ్రామంలో నమోదైన కొట్లాట కేసులో నిందితుడిని  అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు విచారణ అనంతరం నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించబడింది. నిందితుడు బత్తుల సందీప్ బాబు అలియాస్ శాండీ (20), పెదవడ్లపూడి గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. విచారణలో ఇతను గ్రామానికి చెందిన గంజాయి కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసుల్లో నిందితుడైన శశి అనే వ్యక్తితో కలిసి తిరుగుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు వెల్లడైందని ఎస్సై వెంకట్ తెలిపారు.

నిందితుడిపై గతంలో రెండు గంజాయి కేసులు నమోదు, తాజాగా కొట్లాట ఘటన నేపథ్యంలో అతడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అదేవిధంగా నిందితుడిపై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీ షీట్లు నమోదు చేసి చట్టపరమైన చర్యలు కొనసాగిస్తామని గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ స్పష్టం చేశారు.

Related posts

మారుతున్న భారతావనికి నిదర్శనం ఆపరేషన్ సిందూర్

Satyam News

మెడికల్ మాఫియా అక్రమాలపై చర్యలు తీసుకోండి

Satyam News

కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు

Satyam News

ఆసిమ్ మునీర్ తో అబ్బాస్ అరాగ్ఛీ చర్చలు

Satyam News

దక్షిణ మధ్య రైల్వేలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

Satyam News

చేనేతకు ‘అసెంబ్లీ’ ఆదరణ

Satyam News

Leave a Comment