కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో మంగళవారం రోజున మతసామరస్యం వెల్లివిరిసింది. హనుమాన్ మాలధారణ చేసిన స్వాములకు రామడుగు గ్రామసర్పంచి ఎండి మొయిజ్ సద్దాం ప్రత్యేకంగా భిక్ష (అన్నదానం) ఏర్పాటు చేశారు. భక్తి, మానవత్వం మతాల కంటే గొప్పవని ఆయన చాటిచెప్పారు.
ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తాయని, అందరూ ఐక్యంగా ఉండాలని స్వాములు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తబృందం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
