26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

ప్రపంచ కప్ మూడో సారి భారత్ కైవసం

#TeamIndia

ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తుది పోరులో భారత్ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో గెలిచి మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతూ జట్టుకు వేగవంతమైన ఆరంభం ఇచ్చాడు. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా చక్కటి షాట్లతో పరుగులు సాధించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజూ సాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సంజూ సాంసన్ 46 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అభిషేక్ శర్మ 21 బంతుల్లో 52 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 23 బంతుల్లో 54 పరుగులు చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

256 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తట్టుకోలేకపోయింది. టిమ్ సైఫర్ట్ 52 పరుగులతో పోరాడినా ఇతర బ్యాట్స్‌మెన్లు పెద్దగా రాణించలేదు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 14 పరుగులకే అవుట్ కావడంతో జట్టు ఒత్తిడిలో పడింది. చివరకు న్యూజిలాండ్ జట్టు 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది.

భారత్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లు సాధించగా అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు. సమష్టి ప్రదర్శనతో భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టీ20 ప్రపంచకప్‌ను మరోసారి సొంతం చేసుకుంది.

Related posts

నిర్మలమ్మ బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా

Satyam News

నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు

Satyam News

పెన్సిల్వేనియాలో కాల్పులు: ఒకరి హత్య

Satyam News

మరో సారి వంట గ్యాస్ ధర భారీగా పెంపు

Satyam News

ఇంద్రకీలాద్రిపై భక్తులను అలరించిన ‘కూచిపూడి నృత్య ప్రదర్శన’

Satyam News

అగ్నివీర్ పాలసీలో భారీ మార్పులు….?

Satyam News

Leave a Comment