గుంటూరుహోమ్

అందరికీ ఆరాధ్యులు పొట్టి శ్రీరాములు

అమరజీవి పొట్టి శ్రీరాములు కేవలం తెలుగు ప్రజలకే గాక యావత్ భారతీయులకు ఆరాధ్యుడని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. అమరజీవి ఆత్మత్యాగంతో కేవలం తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రంతో పాటూ భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు.

గుజరాతీ, బెంగాళీ వంటి భాషల ఆధారంగా రాష్ట్రాలు ఏర్పడటానికి పొట్టి శ్రీరాములు పోరాటమే కారణమన్నారు. యావత్ ప్రజలు చిరకాలం గుర్తించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ విగ్రహాన్ని రాజధాని అమరావతిలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిందన్నారు.

పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని కొనసాగిస్తూ జిల్లా ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీ ఆర్ ఎస్ ను చెప్పి మరీ చితక్కొట్టిన రేవంత్

Satyam News

లాజిస్టిక్స్ హబ్ ఆఫ్ ఇండియాగా ఏపీ

Satyam News

డ్రగ్స్ రహిత తెలంగాణ సాధిద్దాం

Satyam News

త్రిష ఎంట్రీ తో విజయ్ ఫ్యామిలీ విచ్ఛిన్నం

Satyam News

సుభాష్ నేరాన్ని సమర్థించే వారు ఇది తెలుసుకోవాలి….

Satyam News

తెలుగు టీవీ రైటర్స్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం

Satyam News

Leave a Comment