తమిళనాడులో టీవీకే విజయపథంలో పయనిస్తున్న సందర్భంగా హీరోయిన్ త్రిషకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. టీవీకే అధినేత విజయ్ తో అత్యంత సన్నిహితంగా ఉండే త్రిష తిరుమల వెళ్లి ప్రసాదం తీసుకుని వచ్చి విజయ్ కి ఇచ్చిన వీడియో ఇప్పుడు నేషనల్ ట్రెండింగ్ లో ఉంది.
ఈ సందర్భంగా త్రిష పై మరిన్న ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. ఆ పార్టీ అధినేత విజయ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ విజయం దిశగా దూసుకెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది. తాజా లెక్కింపు ధోరణుల ప్రకారం రెండు స్థానాల్లోనూ స్పష్టమైన ఆధిక్యం కొనసాగుతున్న నేపథ్యంలో, ఒక స్థానాన్ని తప్పనిసరిగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఎన్నికల నియమావళి ప్రకారం ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో గెలిస్తే, అందులో ఒకటిని మాత్రమే కొనసాగించాలి. దీంతో విజయ్ ఏ నియోజకవర్గాన్ని కొనసాగిస్తారు, ఏ స్థానానికి రాజీనామా చేస్తారు అన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ నిర్ణయం పార్టీ భవిష్యత్తు వ్యూహంపై కూడా ప్రభావం చూపే అవకాశముంది.
ఈ నేపథ్యంలో ఖాళీ అయ్యే స్థానానికి ప్రముఖ నటి త్రిష ను రంగంలోకి దింపే అవకాశంపై ప్రచారం జోరుగా సాగుతోంది. తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న ఆమెకు ప్రజల్లో విశేష ఆదరణ ఉండటంతో, ఉపఎన్నికలో పార్టీకి ఇది కలిసొస్తుందని టీవీకే వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ అంశంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. త్రిష నిజంగా రాజకీయాల్లోకి అడుగుపెడతారా, లేదా ఇది కేవలం ప్రచారమేనా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. అయినప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఇక విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత టీవీకే పార్టీకి లభిస్తున్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుంటే, భవిష్యత్తులో పార్టీ మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
