కడపహోమ్

ఎర్రగుంట్లలో రూ.2.52 కోట్లు పట్టివేత

#KadapaPolice

ఎర్రగుంట్ల పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా భారీ ఎత్తున నగదు దొరికింది. ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్రమంగా డబ్బు తరలిస్తూ దొరికిపోయారు. ముద్దనూరు నుంచి ఎర్రగుంట్ల వైపు వస్తున్న కారును వాహనాల తనిఖీలో భాగంగా పోలీసులు ఆపి చెక్ చేశారు. కారులో చెక్ చేయగా 500 రూపాయల నోట్లు మొత్తం రూ. 2.52 కోట్ల నగదు దొరికింది.

ప్రొద్దుటూరు కు చెందిన బంగారు వ్యాపారి మీరావలి గుమాస్తాలు గా వారిని పోలీసులు గుర్తించారు. గుంతకల్లులో శంకర్ నారాయణ అనే వ్యక్తికి బంగారు నగలు ఇచ్చి డబ్బు తీసుకొస్తున్నామని వారు పోలీసులకు వెల్లడించారు. ఐతే ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి బిల్లులు చూపలేదు. దీంతో డబ్బును సీజ్ చేసినట్లు ఎర్రగుంట్ల పోలీసులు ప్రకటించారు.  డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని విచారిస్తామని ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు.

Related posts

బస్సు సేవలకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు

Satyam News

ఏపీలో మత మార్పిడి మాఫియా…. విజయసాయిరెడ్డి సంచలనం!

Satyam News

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కెనడా హై కమిషనర్

Satyam News

దేశవ్యాప్తంగా 5 వేల వేంకటేశ్వర ఆలయాలు

Satyam News

తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదు

Satyam News

దీపావళి వేళ వంటవాడి అవతారం

Satyam News

Leave a Comment