గుంటూరుహోమ్

బీసీ నాయకుడి కాళ్లు విరగ్గొట్టిన వైసీపీ కార్యకర్తలు!

పల్నాడు జిల్లా లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గురజాల మండలం పరిధిలో పులిపాడు–దైద మార్గమధ్యంలో జరిగిన దాడి సంచలనం రేపుతోంది. బీసీ నాయకుడు బత్తుల ఏడుకొండలు బైక్ వెళ్తుండగా, మార్గమధ్యంలో బైక్ ఆపి వైసీపీకి చెందిన వ్యక్తులు గుంపుగా దాడి చేసినట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి.

దాడి దారుణంగా మారి, ఆయన కాళ్లు విరగ్గొట్టినట్లు సమాచారం. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. తీవ్ర గాయాలతో ఉన్న బత్తుల ఏడుకొండలను ముందుగా గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు కు తరలించినట్లు తెలుస్తోంది.

ఈ దాడిపై టిడిపి నాయకులు తీవ్రంగా స్పందిస్తూ, ఇది రాజకీయ కక్షసాధింపేనని ఆరోపిస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

Related posts

తల్లి పాలలో ప్రమాదకర యురేనియం..?

Satyam News

బీసీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ సభ్యులుగా సానా సతీష్

Satyam News

ఇరాన్ మనకు మిత్రుడా? శత్రువా?: విశ్లేషణ

Satyam News

నిలిచిన బీటీ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కలమట

Satyam News

ఎగువ గొట్టివీడు యల్లమ్మ జాతరలో చాందిని బండి

Satyam News

అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!!

Satyam News

Leave a Comment