26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

స్పీడ్ బోటు ప్రమాదం: 19 మంది భారతీయులు మృతి?

#SpeedBoat

వియత్నాంలోని ఫు క్వోక్ ద్వీపం సమీపంలో భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ స్పీడ్‌బోట్ శనివారం ప్రమాదానికి గురైంది. సముద్రంలో బోటు బోల్తాపడడంతో పలువురు నీటిలో చిక్కుకున్నారు. స్థానిక పత్రికల కథనాల ప్రకారం ఈ ప్రమాదంలో 19 మంది మృతిచెందినట్లు వార్తలు వెలువడుతున్నప్పటికీ, మరణాలపై భారత రాయబార కార్యాలయం ఇంకా అధికారికంగా ధృవీకరణ ఇవ్వలేదు.

హనోయ్‌లోని భారత రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ, భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బోటు ఫు క్వోక్ ద్వీపం సమీపంలో బోల్తాపడిన విషాద ఘటన జరిగినట్లు తెలిపింది. ప్రస్తుతం స్థానిక అధికారులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారని పేర్కొంది.

ప్రమాదం అనంతరం సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయులకు అవసరమైన సమాచారం, సహాయం అందించేందుకు హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం, హనోయ్‌లోని భారత రాయబార కార్యాలయంలో ప్రత్యేక నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సహాయం అవసరమైన వారు ఈ కేంద్రాలను సంప్రదించాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.

అధికారుల సమాచారం ప్రకారం, బోటులో మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులతో పాటు నలుగురు సిబ్బంది ప్రయాణిస్తున్నారు. స్థానిక దినపత్రిక వీఎన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, హోన్ మే రుట్ ద్వీపం నుంచి ఆన్ థోయ్ నౌకాశ్రయానికి వెళ్తున్న సమయంలో ఒడ్డుకు సుమారు 400 మీటర్ల దూరంలో స్పీడ్‌బోట్ బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో సముద్రంలో అలలు తీవ్రంగా ఉండటంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు వెల్లడించింది. గల్లంతైన వారి కోసం శోధన, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.

Related posts

‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

Satyam News

రాష్ట్రంలో రాజకీయం చేసే అర్హత గొడ్డలి పార్టీకి ఎక్కడిది..?

Satyam News

ఇరాన్ లో 170 సైనిక స్థావరాలు నేలమట్టం?

Satyam News

తిరుమలపై కుట్రలు ఆపవా జగన్…..?

Satyam News

భారత్ ను ముంచెత్తనున్న అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు?

Satyam News

ధనవంతుడైన మామ హత్యకు కోడలు కుట్ర?

Satyam News

Leave a Comment