ముఖ్యంశాలుహోమ్

అల్పపీడన ప్రభావంతో రెండు రోజులు వర్షాలు

#rain

ఉపరితల ఆవర్తన ప్రభావంతో 24 గంటల్లోపు వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న రెండురోజులు రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతోపాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.  ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో చెట్లు, పోల్స్ , హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని సూచించారు.

రేపు శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం,  విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.  ఉత్తరాంధ్ర తీరం వెంబడి  గంటకు 40-50 కిమీ  వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని  విజ్ఞప్తి చేశారు.

శనివారం (08-08-2026):  శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, విశాఖ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు,  ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Related posts

మన బడి పిలుస్తోంది..మనబడి గెలుస్తోంది

Satyam News

లండన్ లో ఎండల తీవ్రత: అల్లాడిపోతున్న జనం

Satyam News

ఎయిర్ అంబులెన్స్ కూలి 7 గురు మృతి

Satyam News

కూటమి పాలనలో అన్ని అక్రమ అరెస్టులే

Satyam News

కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై సంచలన ఆరోపణలు

Satyam News

జగన్ కోటరీపై ఈడీ పంజా…!

Satyam News

Leave a Comment