26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

#Revanthreddy

హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మంగళవారం హాజరయ్యారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ, తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో తనపై నమోదైన కేసుల విషయంలో ఆయన నాంపల్లిలోని మనోరంజన్ కోర్టులో వ్యక్తిగతంగా హాజరై విచారణను ఎదుర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహించారన్న ఆరోపణలపై 2016లో రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అలాగే వివిధ కారణాలతో తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్లలో కూడా అప్పట్లో కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన ఈ కేసులను కొట్టివేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తనపై అక్రమంగా కేసులు పెట్టారని పేర్కొంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ కొనసాగుతుండగా, ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ మూడు కేసులకు సంబంధించిన విచారణ పూర్తయినట్లు సమాచారం.

Related posts

గాంధీని, పొట్టి శ్రీరాములును మరచిన ఆర్యవైశ్య నేతలు

Satyam News

జగన్ రెడ్డి విధ్వంసకర పాలన ముగిసి రెండేళ్ళు

Satyam News

మంథనిలో న్యాక్ స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్

Satyam News

ప్రేమ.. దొంగ పెళ్లి… చివరకు విషాదం..

Satyam News

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే

Satyam News

హిందూ సంప్రదాయాలను అవమానిస్తే కఠిన చర్యలు

Satyam News

Leave a Comment