25.2 C
Hyderabad
September 20, 2026
ముఖ్యంశాలుహోమ్

ఏపీ లో తగ్గనున్న కరెంట్ ఛార్జీలు

#ChandrababuNaidu

రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర కానుకగా అదిరిపోయే శుభవార్త అందించారు. గత జగన్ పాలనలో ఐదేళ్లలో (2019-20 నుంచి 2023-24 వరకు) పేరుకుపోయిన ₹4,497.89 కోట్ల విద్యుత్ ‘ట్రూఅప్’ భారాన్ని ప్రజలపై వేయకుండా, ఆ మొత్తాన్ని చంద్రబాబు ప్రభుత్వమే భరించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మాట నిలబెట్టుకున్న చంద్రబాబు, లోకేష్

ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు, యువగళం పాదయాత్రలో లోకేష్ “మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోము, తగ్గిస్తాము” అని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన కొద్ది కాలంలోనే ఆ హామీని అమలు చేస్తూ, వేల కోట్ల భారం ప్రజలపై పడకుండా అడ్డుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసింది. దీంతో సామాన్యుల ఇంటి బడ్జెట్‌పై పడాల్సిన పెను భారం తప్పినట్లయింది.

డిస్కమ్‌ల ప్రతిపాదనలు – తిరస్కరించిన చంద్రబాబు

విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) మొత్తం ₹14,207.52 కోట్లను ట్రూఅప్ ఛార్జీల కింద వసూలు చేయాలని ప్రతిపాదించాయి. ఇందులో డిస్కమ్‌లు చూపిన లెక్కలను నిశితంగా పరిశీలించిన చంద్రబాబు ప్రభుత్వం ₹8,274.07 కోట్ల ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అనుమతించిన ₹4,497.89 కోట్లను ప్రజలపై మోపకుండా చంద్రబాబు ప్రభుత్వం తన భుజాన వేసుకుంది.

జగన్ ప్రభుత్వ భారాల నుంచి విముక్తి

గత ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. రకరకాల సర్దుబాటు ఛార్జీలతో సామాన్యుడి నెలవారీ బిల్లు తడిసి మోపెడయ్యేది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో, పాత బకాయిల తాలూకు భారం నుంచి వినియోగదారులకు శాశ్వత విముక్తి లభించనుంది. దీనివల్ల మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకు కరెంటు బిల్లుల భారం గణనీయంగా తగ్గనుంది.

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. “కరెంటు బిల్లులు మళ్ళీ పెరుగుతాయని భయపడ్డాము, కానీ చంద్రబాబు గారు మమ్మల్ని ఆదుకున్నారు” అని వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమలకు, చిన్న వ్యాపారులకు కూడా ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర ఖజానాపై భారం పడినప్పటికీ, ప్రజల సంక్షేమమే మా ప్రథమ ప్రాధాన్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Related posts

మీడియా అక్రిడిటేషన్ నిబంధనలపై హైకోర్టులో విచారణ

Satyam News

గంజాయి కేసులో వైసీపీ లీడర్ కామాక్షి అరెస్ట్!

Satyam News

అమరావతిలో ధోనీ క్రికెట్ అకాడెమీ ప్లస్ ట్రైనింగ్ సెంటర్..??

Satyam News

19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు ప్రారంభం

Satyam News

నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్

Satyam News

గణనాథుని సేవించే మహా పర్వదినం

Satyam News

Leave a Comment