26.3 C
Hyderabad
September 19, 2026
కృష్ణహోమ్

హెడ్ కానిస్టేబుల్ కు అండగా నిలిచిన పోలీసు శాఖ

ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (APSPF) విజయవాడ జోన్ 1998 బ్యాచ్‌కు చెందిన ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వై. రాజశేఖర్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన 2024 జనవరిలో ఎస్పీఎఫ్ విభాగం నుండి వాలంటరీ రిటైర్మెంట్ పొందారు.

విభాగంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ, కుటుంబ సభ్యులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో విజయవాడ జోన్ తరఫున రూ.2,40,000/- (రెండు లక్షల యాభై వేల రూపాయలు) ఆర్థిక సహాయం అందజేయబడింది.

ఈ మొత్తాన్ని విజయవాడ జోన్ పరిధిలోని విజయవాడ గార్డ్స్ యూనిట్, ఏపీ సెక్రటేరియట్ యూనిట్, ఏపీ హైకోర్టు యూనిట్ మరియు కమాండెంట్ ఆఫీస్ సిబ్బంది కలిసి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించారు. కమాండెంట్ ఎం. శంకరరావు ద్వారా, డీఎస్పీలు మల్లికార్జున్ రావు ఏపీ సెక్రటేరియట్ యూనిట్, హేమసుందర్ రావు మరియు ఇన్స్పెక్టర్ ఫణి కుమార్ విజయవాడ గార్డ్ యూనిట్ ఆధ్వర్యంలో అన్ని యూనిట్ల సిబ్బంది సమక్షంలో కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా అధికారులు మరియు సిబ్బంది కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసినారు.

Related posts

సంబరంగా నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర “సంత” చిత్ర కళా ప్రదర్శన

Satyam News

భారీ ఎత్తున సీనియర్ ఐపిఎస్ ల బదిలీలు

Satyam News

మోడీ ట్రంప్ మధ్యలో ఎలాన్ మస్క్

Satyam News

దేవదేవుడి లడ్డూ కల్తీపై గర్జించిన స్వామీజీలు

Satyam News

ఆసుపత్రిలో చేరిన సల్మాన్ ఖాన్ తండ్రి

Satyam News

దళితుల హక్కుల కోసం మాట్లాడితే కేసులా?

Satyam News

Leave a Comment