ప్రత్యేకంహోమ్

మోడీ ట్రంప్ మధ్యలో ఎలాన్ మస్క్

#ElonMask

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్రమోడీతో జరిగిన ఫోన్ సంభాషణ ఫలప్రదంగా సాగిందని వైట్ హౌస్ శుక్రవారం తెలిపింది. మంగళవారం ఈ ఇద్దరు నేతలు మధ్య జరిగిన చర్చల్లో పశ్చిమ ఆసియా పరిస్థితులపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

ది న్యూయార్క్ టైమ్స్ రిపోర్టు చేసిన దాని ప్రకారం, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కూడా ఈ ఫోన్ కాల్‌లో పాల్గొన్నారు. యుద్ధ పరిస్థితుల్లో ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగే చర్చలో ఒక ప్రైవేట్ వ్యక్తి పాల్గొనడం అసాధారణమని ఆ నివేదిక పేర్కొంది. ఈ విషయంపై స్పందించిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లీయావిట్, ట్రంప్‌కు మోదీతో మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ సంభాషణ సానుకూలంగా జరిగిందని తెలిపారు.

అమెరికా అధికారులను ఉదహరిస్తూ వచ్చిన నివేదికలో, మస్క్ ఈ కాల్‌లో ఎందుకు పాల్గొన్నారు లేదా మాట్లాడారా అనే విషయంపై స్పష్టత లేదని పేర్కొన్నారు. అలాగే, గతంలో ట్రంప్ ప్రభుత్వంతో విభేదాల కారణంగా దూరమైన మస్క్ ఇప్పుడు మళ్లీ ట్రంప్‌తో సన్నిహితంగా ఉన్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపింది.

ఫిబ్రవరి 28న పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత ట్రంప్, మోదీ మధ్య ఇది తొలి సంభాషణ కావడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ప్రపంచ శాంతి, స్థిరత్వం మరియు ఆర్థికాభివృద్ధికి కీలకమైన హోర్ముజ్ జలసంధి భద్రంగా, అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యమని ప్రస్తావించినట్లు సమాచారం.

Related posts

రెండో టీ20లో భారత్ ఘనవిజయం

Satyam News

డీలిమిటేషన్ తెలంగాణకు ఒక వరం?

Satyam News

దారుణ ప్రమాదం: ఏడుగురు మహిళలు మృతి

Satyam News

పాడి రైతులకు క్రెడిట్‌ కార్డులు‌….. ఏపీ ప్రభుత్వం కొత్త స్కీమ్‌

Satyam News

అయిజలో అంతర్జాతీయ మహిళా కబడ్డీ టోర్నమెంట్

Satyam News

సినీ దర్శకుడు డా. పీసీ ఆదిత్య కు పర్యావరణ పురస్కారం

Satyam News

Leave a Comment