26.7 C
Hyderabad
September 20, 2026
విశాఖపట్నంహోమ్

దేవదేవుడి లడ్డూ కల్తీపై గర్జించిన స్వామీజీలు

#Vizag

తిరుమల దేవదేవుని లడ్డూ కల్తీపై ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం (ఆందోళన) నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆధ్వర్యంలో తయారయ్యే ప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలపై సాధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేవదేవుని ప్రసాద పవిత్రతను కాపాడాలని, ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అదే విధంగా, గత ప్రభుత్వం కాలంలో జగన్ మోహన్ రెడ్డి మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందూ సమాజంపై దాడులు చేశారని, 300కు పైగా దేవాలయాలను ధ్వంసం చేశారని సాధువులు ఆరోపించారు.

తిరుమల లడ్డూలో అసలు నెయ్యి ఉపయోగించకుండా రసాయనాలతో తయారు చేసిన నెయ్యితో లడ్డూలు చేయడం మహాపాపమని పేర్కొన్నారు. దీనికి ప్రాయశ్చిత్తం జరగాలని, ఈ ఘోర తప్పిదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హిందువులందరూ ఒక్కటై ముందుకు రావాలని, సాధు పరిషత్ ఆధ్వర్యంలో త్వరలో విజయవాడలో భారీ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి అని వ్యాఖ్యానించారు.

ఈ ఆందోళనలో పాల్గొన్న ప్రముఖులు: స్వామి శ్రీనివాస్ నంద సరస్వతి, ఆత్మానంద స్వామి, దయానంద స్వామి, గాయత్రి మాతాజీ, నిరంజన్ దాస్, యోగేష్ కృష్ణ నందగిరి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు ఇతర సాధువులు పాల్గొన్నారు.

Related posts

మానవ జీవితం గొప్పగా ఉండేందుకే సనాతన ధర్మం

Satyam News

కృష్ణాష్టమి సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు

Satyam News

అలంపూర్ జోగులాంబ శక్తిపీఠంలో శ్రీచక్ర స్థిర ప్రతిష్ఠ

Satyam News

19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు ప్రారంభం

Satyam News

ఏపీలో ప్రకృతి బజార్‌లు…. ఆర్గానిక్‌ పంటలతో వంటలు

Satyam News

రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోళ్లు ఆరంభం

Satyam News

Leave a Comment