గుంటూరుహోమ్

హోలీ వేడుకలలో విషాదం: ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం బసికాపురంలో హొలీ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఈతకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి గోపి (16) దురదృష్టవశాత్తు కనుమూశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హొలీ వేడుకల సందర్భంగా నీటిగుంటలో ఈతకి దిగిన నలుగురు స్నేహితులు నీటి కుంటలో దిగారు.

కాసేపటి తర్వాత ఒడ్డుకు చేరుకున్న ముగ్గురు స్నేహితులు ఒడ్డుకు చేరగా, గోపి కనిపించలేదు. దీంతో స్నేహితులు గ్రామాలలోకి వెళ్లి గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా, వారు నీటిగుంటలో ఎనిమిది గంటలు గాలించి గోపిని బయటికి తీశారు. అప్పటికే గోపి మృతి చెందాడని తెలిపారు.

పండుగ రోజు కావడంతో విద్యార్థులు సరదాగా ఈతకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈత సరదా గోపి ప్రాణం తీసిందని కుటుంబ సభ్యులు విలపించారు. విద్యార్థి చనిపోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

Related posts

ఆన్‌లైన్‌లో మహానాడు: చంద్రబాబు సంచలన నిర్ణయం

Satyam News

షాద్ నగర్ లో మెడికల్ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు

Satyam News

రెండు పెళ్లిళ్లు..సహజీవనం..అక్రమ సంబంధం..చివరకు మర్డర్

Satyam News

వేసవిలో నీటి ఎద్దడి రానీయకుండా చెరువులు నింపాలి

Satyam News

అమరావతి పూర్తయితే లక్ష కోట్ల ఆదాయం

Satyam News

శ్త్రీ శక్తి డిజిటల్ మహానాడుకు అనంతపురంలో ఘన ఏర్పాట్లు

Satyam News

Leave a Comment