26.3 C
Hyderabad
September 19, 2026
గుంటూరుహోమ్

మదర్సా విద్యార్థులకు, మహిళలకు నూతన వస్త్రాల అందజేత

#Madarsa

పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట వరవకట్టలోని మదర్సా ఏ ఫాతిమా జహేరాలో (తాలిం) విద్యను అభ్యసిస్తున్న ముస్లిం మహిళలకు, చిన్నారులకు శుక్రవారం అంజుమన్ జామియా మసీదు కమిటీ సంఘం సభ్యులు నూతన వస్త్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మసీదు కమిటీ సభ్యులు మాట్లాడుతూ నరసరావుపేట పట్టణంలోని ఈ మదర్సాను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు సహకారంతో, ఈ మదర్సాలో వస్తాద్ బి ని పెట్టి క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని ముస్లిం మహిళలు, చిన్నారులు ఈ మదర్సాలో విద్యను అభ్యసించవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మదినారసూల్, అంజుమన్ కమిటీ అధ్యక్షులు రహమత్ అలిగారు, నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు మాబు, పల్నాడు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు షేక్. అఖిలా, పట్టణ తెలుగు మహిళ అధ్యక్షురాలు మస్తాన్ బి, అంజుమన్ కమిటీ సభ్యులు కరిముల్లా, సుభాని, షేక్. బాజి, ఐటీడీపీ మస్తాన్, ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related posts

సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం

Satyam News

పాలపిట్ట దర్శనం శుభసూచకం

Satyam News

మహిళల సమస్యల సత్వర పరిష్కారానికి ఆన్ లైన్ పోర్టల్

Satyam News

తప్పుడు మాటలతో తికమక జగన్

Satyam News

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

Satyam News

మంత్రి నారా లోకేష్ సహకారంతో రంజాన్ తోఫా

Satyam News

Leave a Comment