కొల్లాపూర్ నియోజకవర్గంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మసీదు వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
సమాజంలో ఐక్యత, సౌహార్దత పెంపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మాచుపల్లి బాలస్వామి, రామాపురం మాజీ సర్పంచ్ బచ్చలకూర బాలరాజు, కుడికిల్ల సర్పంచ్ రఘుపతిరావు, కిరణ్ తేజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కూడా ఈ వేడుకల్లో హాజరయ్యారు. ముస్లిం సమాజానికి చెందిన పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.
