ఖమ్మంహోమ్

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

#Tummala

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలు, పరిశుభ్రత, ఔషధాల లభ్యత తదితర అంశాలపై ఆయన సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని వైద్య అధికారులు, సిబ్బందికి స్పష్టం చేశారు.

ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించేలా సేవల ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు.

అనంతరం ప్రత్యేక ఓటరు సర్వే కార్యక్రమం (ఎస్‌ఐఆర్)లో భాగంగా ఖమ్మం నియోజకవర్గంలోని వీడీవో కాలనీలో జరుగుతున్న ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను మంత్రి పరిశీలించారు. కార్యక్రమం పురోగతి, నిర్వహణ తీరుపై అధికారులతో చర్చించి అవసరమైన సూచనలు చేశారు.

Related posts

కళా భూమి యుగాది పురస్కారానికి పీసీ ఆదిత్య ఎంపిక…

Satyam News

ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టులు

Satyam News

అఖండ 2 వెయ్యికోట్ల గ్రాస్: పెరిగిపోతున్న పందాలు

Satyam News

సైనికాధికారి భార్యపై కన్నేసిన దుర్మార్గులు

Satyam News

పశ్చిమ బెంగాల్ లో ఉమ్మడి పౌరస్మృతి అమలు

Satyam News

మహాలక్ష్మీకి రెండు సంవత్సరాలు పూర్తి

Satyam News

Leave a Comment