హోర్మోజ్ జలసంధి నుంచి మరో రెండు భారతీయ ఎల్పీజీ క్యారియర్ నౌకలు విజయవంతంగా బయటకు వచ్చాయి. పైన్ గ్యాస్, జగ్ వసంత్ అనే రెండు భారతీయ ఎల్పీజీ క్యారియర్ నౌకలు కీలకమైన హోర్మోజ్ జలసంధి ద్వారా విజయవంతంగా ప్రయాణించడంతో భారతీయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం 92,612.59 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని మోస్తున్న ఈ నౌకలు భారత్కు ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఈ నౌకలలో పైన్ గ్యాస్ లో 27 మంది, జగ్ వసంత్ లో 33 మంది భారతీయ సముద్ర సిబ్బంది ఉన్నారు. ప్రస్తుత గ్లోబల్ ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్మోజ్ జలసంధి ద్వారా ప్రయాణం సవాళ్లతో కూడుకున్నదైనా, ఈ నౌకలు సురక్షితంగా ప్రయాణించడం విశేషంగా భావిస్తున్నారు. ఈ రెండు నౌకలు మార్చి 26 నుంచి 28 మధ్యలో భారత తీరంలోని వివిధ పోర్టులకు చేరుకునే అవకాశం ఉందని సమాచారం.
దేశంలో ఎల్పీజీ సరఫరా కొనసాగింపుకు ఇవి ఎంతో కీలకంగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల మధ్య ఇలాంటి సరఫరా ప్రయాణాలు సాఫీగా కొనసాగడం భారత ఇంధన భద్రతకు ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు.
