విజయనగరంహోమ్

ప్ర‌ముఖ న్యాయ‌వాది కోల‌గ‌ట్ల త‌మ్మ‌న్నశెట్టి ఆత్మహత్య

ప్ర‌ముఖ న్యాయ వాది,ఏపీ రాష్ట్ర బార్ కౌన్సిల్ నేత కోల‌గ ట్ల త‌మ్మ‌న్న‌శెట్టి(67) బుధ‌వారం ఆత్మహత్య చేసుకున్నారు.నగ‌రంలోని ఎస్వీఎన్ న‌గ‌ర్ స‌మీపం మ‌హాలక్ష్మీ న‌గ‌ర్ లో త‌న సొంత ఇంటిలోనే మూడో అంత‌స్థులో ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని విజ‌య‌న‌గ‌రం టూటౌన్ సీఐ శ్రీనివాస‌రావు తెలిపారు.

ఆయ‌న సోద‌రుడు స్వామి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌న్నారు. విజ‌య‌న‌గ‌రంలో బార్ కౌన్సిల్ ఎన్నిక‌ల‌లో త‌మ్మ‌న్న శెట్టి అనూయాయుడే గెలుపొంద‌డంతో ఆయన మనస్తాపం చెందినట్లు తోటి న్యాయ‌వాదులు పేర్కొన్నారు. త‌మ్మ‌న్న‌శెట్టికి ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు. పెళ్లైన వారిద్ద‌రూ ఆస్ట్రేలియాలోనే ఉంటున్నారు.

న్యాయ‌వాది త‌మ్మ‌న్న‌శెట్టి ఇక లేర‌న్నవార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, మాజీఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ క‌న్నీరుమున్నీరయ్యారు.

Related posts

అలంపూర్ జోగులాంబ శక్తిపీఠంలో శ్రీచక్ర స్థిర ప్రతిష్ఠ

Satyam News

తాడేపల్లిగూడెం లో డైమండ్ షో రూమ్ ప్రారంభం

Satyam News

క‌మ్యూనిస్ట్ ల కుట్ర‌లో భాగమే ఏయూ ఘ‌ట‌న‌

Satyam News

రికార్డు స్థాయి వృద్ధిరేటు లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్

Satyam News

కాకినాడలో స్పేస్‌ స్టేషన్‌…. హోప్‌ ఐలాండ్‌ నుంచి రాకెట్లు..!!

Satyam News

“తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” ఏర్పాట్లు పూర్తి

Satyam News

Leave a Comment