25.2 C
Hyderabad
September 20, 2026
జాతీయంహోమ్

ఒరిస్సాలో ఉపరితల ఆవర్తనంతో మారిన వాతావరణం

#rain

ఒరిస్సాలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం మారింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు.

గంగానది ప్రాంతం నుంచి పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించి, అక్కడి నుంచి మన్నార్ గల్ఫ్ వరకు సాగుతున్న ద్రోణి ప్రస్తుతం ఒడిశా పై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా కొనసాగుతోందని చెప్పారు. ఈ వాతావరణ పరిస్థితులతో పాటు సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు రాష్ట్రం వైపు వీస్తుండటంతో వర్షాలు కురిసే అవకాశాలు పెరిగినట్లు తెలిపారు.

ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా ప్రాంతాల్లో ఈరోజు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఒకటి రెండు చోట్ల తేలికపాటి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.

రాబోయే 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడిచిన 24 గంటల్లో అత్యధిక వర్షపాతం విజయనగరం జిల్లాలోని తెర్లాం లో నమోదైందని తెలిపారు.

అక్కడ 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు, మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.

Related posts

ఎన్నిక ఏదైనా కాంగ్రెస్‌దే విజయం

Satyam News

శ్రీరంగాపూర్ ఎస్సై బాధ్యత చేపట్టిన హిమబిందు

Satyam News

మహిళల్ని వేధిస్తున్న వైసీపీ నేత

Satyam News

పండగ రోజున లాఠీకి పని చెప్పిన పోలీసులు.

Satyam News

టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా?

Satyam News

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంని విమర్శించే స్థాయి మీకు లేదు

Satyam News

Leave a Comment