26.7 C
Hyderabad
September 20, 2026
ముఖ్యంశాలుహోమ్

పాకిస్తాన్ లో నేటి నుంచి లాక్ డౌన్

#Taliban

పాకిస్తాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరతల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ‘స్మార్ట్ లాక్‌డౌన్’ అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఇంధన సరఫరా తీవ్రంగా దెబ్బతినడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు భాగంగా పలు ఆంక్షలను అమలు చేస్తున్నారు. తాజా మార్గదర్శకాల ప్రకారం, షాపింగ్ మాల్స్ రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే బేకరీలు, రెస్టారెంట్లు, ధాబాలు, ఫంక్షన్ హాల్స్ రాత్రి 10 గంటల తర్వాత పనిచేయరాదని స్పష్టం చేశారు.

ఈ ఆంక్షలు పంజాబ్, ఖైబర్ పఖ్తున్క్వా, బెలూచిస్తాన్, ఇస్లామాబాద్, గిల్జిత్ బ్లాస్టాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో అమలులోకి వస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

దేశంలో పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి, ఇంధన సంక్షోభం నేపథ్యంలో ప్రజలపై ప్రభావం తగ్గించేలా ప్రభుత్వం ఈ ‘స్మార్ట్ లాక్‌డౌన్’ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. అవసరమైన సేవలను కొనసాగిస్తూ, అవసరం లేని కార్యకలాపాలను పరిమితం చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.

ఈ పరిణామాలు పాకిస్తాన్‌లో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతున్నాయన్న సంకేతాలను ఇస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts

13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఆవిరి

Satyam News

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన క్రిమినల్స్!

Satyam News

రాజకీయ పాఠశాల ప్రజాస్వామ్యానికి పునాది..

Satyam News

చేనేత గర్జనతో మార్మోగిన మంగళగిరి

Satyam News

వైజాగుకు వైకాపా తలాక్!

Satyam News

వైకుంఠద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు

Satyam News

Leave a Comment