జాతీయంహోమ్

ఒరిస్సాలో ఉపరితల ఆవర్తనంతో మారిన వాతావరణం

#rain

ఒరిస్సాలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం మారింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు.

గంగానది ప్రాంతం నుంచి పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించి, అక్కడి నుంచి మన్నార్ గల్ఫ్ వరకు సాగుతున్న ద్రోణి ప్రస్తుతం ఒడిశా పై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా కొనసాగుతోందని చెప్పారు. ఈ వాతావరణ పరిస్థితులతో పాటు సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు రాష్ట్రం వైపు వీస్తుండటంతో వర్షాలు కురిసే అవకాశాలు పెరిగినట్లు తెలిపారు.

ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా ప్రాంతాల్లో ఈరోజు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఒకటి రెండు చోట్ల తేలికపాటి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.

రాబోయే 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడిచిన 24 గంటల్లో అత్యధిక వర్షపాతం విజయనగరం జిల్లాలోని తెర్లాం లో నమోదైందని తెలిపారు.

అక్కడ 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు, మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.

Related posts

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి విజయవంతంగా శస్త్ర చికిత్స

Satyam News

అసదుద్దీన్ కు కీలక పదవి ఇచ్చిన బీజేపీ

Satyam News

ప్యాలెస్ మారుతున్న జగన్: లోటస్‌పాండ్‌పై దండయాత్ర!

Satyam News

కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్… సూపర్ హిట్

Satyam News

జనసేన పార్టీ పునర్నిర్మాణానికి కొత్త విధానం

Satyam News

తదుపరి సీఎస్ ఎవరు?

Satyam News

Leave a Comment