ముఖ్యంశాలుహోమ్

పాకిస్తాన్ లో నేటి నుంచి లాక్ డౌన్

#Taliban

పాకిస్తాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరతల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ‘స్మార్ట్ లాక్‌డౌన్’ అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఇంధన సరఫరా తీవ్రంగా దెబ్బతినడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు భాగంగా పలు ఆంక్షలను అమలు చేస్తున్నారు. తాజా మార్గదర్శకాల ప్రకారం, షాపింగ్ మాల్స్ రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే బేకరీలు, రెస్టారెంట్లు, ధాబాలు, ఫంక్షన్ హాల్స్ రాత్రి 10 గంటల తర్వాత పనిచేయరాదని స్పష్టం చేశారు.

ఈ ఆంక్షలు పంజాబ్, ఖైబర్ పఖ్తున్క్వా, బెలూచిస్తాన్, ఇస్లామాబాద్, గిల్జిత్ బ్లాస్టాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో అమలులోకి వస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

దేశంలో పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి, ఇంధన సంక్షోభం నేపథ్యంలో ప్రజలపై ప్రభావం తగ్గించేలా ప్రభుత్వం ఈ ‘స్మార్ట్ లాక్‌డౌన్’ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. అవసరమైన సేవలను కొనసాగిస్తూ, అవసరం లేని కార్యకలాపాలను పరిమితం చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.

ఈ పరిణామాలు పాకిస్తాన్‌లో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతున్నాయన్న సంకేతాలను ఇస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts

ఏఐలో దేశంలోనే ఏపీ టాప్‌…. లోకేష్‌కి కేంద్ర మంత్రి కితాబు

Satyam News

ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు సీఎస్

Satyam News

అమెరికాకు లోకేష్..పెరిగిన అంచనాలు.!

Satyam News

తొలి ప్రవాస భారతీయుని బయోగ్రఫీ “జిందగీ ఇన్ టు షేడ్స్”

Satyam News

రెగ్యులర్ షూటింగ్ లో భీమవరం టాకీస్ “మహానాగ”

Satyam News

టీడీపీ నేత మక్కెన కుమారుడి వివాహ వేడుకకు హాజరైన లోకేష్

Satyam News

Leave a Comment