గుంటూరుహోమ్

రెండు పెట్రోల్ బ్యాంకులను సీజ్ చేసిన కలెక్టర్

పల్నాడు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇంధన విక్రయాలు జరుపుతున్న రెండు పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సీజ్ చేశారు. నరసరావుపేట పట్టణంలోని శ్రీనిధి ఫిల్లింగ్ స్టేషన్ మరియు పిడుగురాళ్లలోని తిరుమల ఫిల్లింగ్ స్టేషన్లలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించిన అధికారులు, కలెక్టర్ ఆదేశాల మేరకు తక్షణమే వాటిని మూసివేశారు.

జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పెట్రోల్ బంకుల వద్ద రద్దీని అదుపు చేయడానికి మరియు అక్రమ అమ్మకాలను అరికట్టడానికి కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు.

సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఇంధన సరఫరాలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించిన ఆమె, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలతో జిల్లాలోని పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి ప్రస్తుతం అదుపులోకి వచ్చింది.

Related posts

ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు

Satyam News

రాయచోటిలో వర్ష బీభత్సం: నలుగురు మృతి

Satyam News

విశాఖ ఉక్కు ప్రమాద బాధితులను పరామర్శించిన లోకేష్

Satyam News

అర్థరాత్రి ఖాకీలు కుయ్యి… కుయ్యిమంటూ అలెర్ట్

Satyam News

విశాఖ స్మార్ట్ మొబిలిటీకి మాస్కోతో కీలక ఒప్పందం

Satyam News

దివ్యాంగులకు ఉచిత ప్రయాణానికి శ్రీకారం

Satyam News

Leave a Comment