విశాఖపట్నంహోమ్

విశాఖ ఉక్కు ప్రమాద బాధితులను పరామర్శించిన లోకేష్

#LokeshPatna

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్పందించిన ఆయన, విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)కు చేరుకున్నారు. ఈ దురదృష్టకర ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులను మంత్రి లోకేష్ స్వయంగా కలిసి పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, అప్పుడు ఉన్న పరిస్థితులను బాధితుల కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ పరామర్శలో మంత్రి లోకేష్ వెంట కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి సంధ్యారాణి, విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అలాగే చింతకాయల విజయ్ తదితర ప్రముఖులు ఉన్నారు. విషాదంలో ఉన్న మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మలు ధైర్యం చెప్పారు. బాధితులు ఎవరూ అధైర్యపడకూడదని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, కష్టకాలంలో ఉన్న బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో అండగా నిలబడేందుకే కేంద్ర, రాష్ట్రాలలోని ఎన్డీయే ప్రభుత్వ ప్రతినిధులు, ఉప ముఖ్యమంత్రి సైతం ఇక్కడికి తరలివచ్చారని పేర్కొన్నారు. ఈ కుటుంబాలకు కేవలం ఇప్పుడే కాకుండా జీవితాంతం తోడుగా ఉంటామని ఆయన మాట ఇచ్చారు. అలాగే, అందరం కలిసికట్టుగా పోరాడటం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోగలిగామని గుర్తుచేశారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోందని, కమిటీ నివేదిక అందిన తర్వాత బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

Related posts

చండ్ర రాజేశ్వరరావు ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకం

Satyam News

ముగ్గురు రౌడీషీటర్లకు జిల్లా బహిష్కరణ

Satyam News

బంగారం వెండిపై భారీగా దిగుమతి సుంకం

Satyam News

తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో లైంగికదాడి?

Satyam News

సీబీఎన్@361 డిగ్రీస్ పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Satyam News

రేవంత్ రెడ్డి పాలనలో దిగజారిన శాంతిభద్రతలు

Satyam News

Leave a Comment