ఆధ్యాత్మికంహోమ్

శ్రీశైలంలో భారీ గా పెరిగిన భక్తుల రద్దీ

#SrisailamTemple

ప్రఖ్యాత శైవక్షేత్రం శ్రీశైలంలో వెలసిన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది..వేసవి సెలవులు నేపథ్యంలో రెట్టింపు స్థాయిలో భక్తులు మల్లన్నను దర్వించుకుంటోన్నారు. దీంతో వారికి కల్పించే సౌకర్యాలు, స్పర్శ దర్శనం టికెట్లకు సంబంధించిన అంశాలపై ఆలయ అధికారులు దృష్టి సారించారు. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు.

రద్దీ అధికంగా కావడం వల్ల ఈ విధానాల్లో తాత్కాలిక మార్పులు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ప్రొటోకాల్‌ వీఐపీ బ్రేక్‌ స్పర్శ దర్శన టిక్కెట్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. నేటి నుంచి నుంచి జూన్‌ 1వ తేది వరకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు పూర్తిగా నిలిపివేశారు. అలంకార దర్శనాలు మాత్రమే కల్పించనున్నారు. వారాంతపు సెలవులు కావడంతో పాటు వేసవి ముగింపు దశకు రావడంతో శ్రీశైలానికి సాధారణ భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది.

Related posts

రష్యా అధ్యక్షుడిని కూడా అమెరికా బంధిస్తుందా?

Satyam News

అక్కను వదిలేసి మరో పెళ్ళి చేసుకున్న బావ హత్య

Satyam News

జగన్‌ జిల్లాకి కూటమి సర్కార్‌ కానుక

Satyam News

జూలై నెలలో శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Satyam News

సంప్ర‌దాయం ఆధునిక‌త‌ల మేళ‌వింపుగా బతుకమ్మ వేడుక‌లు

Satyam News

ఎర్రజెండా పోరాటానికి కాంగ్రెస్ అండ

Satyam News

Leave a Comment