రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని ఇస్కాన్ ఆలయం – కూకట్ పల్లి అద్వర్వ్యలో వైభవంగా నిర్వహించిన శ్రీ జగన్నాథ్ రథయాత్ర – 2026 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ్ రథయాత్ర ను పురస్కరించుకొని ఇస్కాన్ టెంపుల్ నిర్వహణ లో కూకట్ పల్లి లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం, అశేష జనవాహిని మధ్య భక్తులు ‘జై జగన్నాథ్’ , ‘హరే రామ’ ‘హరే కృష్ణ’ నామస్మరణ నినాదాలతో మార్మోగిస్తూ భక్తిశ్రద్ధలతో జగన్నాథుడి రథచక్రాలను లాగారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ భక్తితో స్వామి వారి ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.
