మహబూబ్ నగర్ పట్టణంలో పూరీ జగన్నాధ్ రథయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూరీ జగన్నాధ్ రథాన్ని లాగి, యాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ పూరీ జగన్నాథ్ రథయాత్ర మహబూబ్ నగర్ లో ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటునందుకు అందరికీ శుభాకాంక్షలు. పూరీ జగన్నాథ స్వామి వారి ఆశీస్సులు అందరి పై ఉండపని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి,జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
